Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గత కొద్దిరోజులుగా ఐదువేల దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,83,360కి చేరాయి. ఇందులో 4,40,13,999 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,611 మంది మరణించారు. మరో 40,750 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 27 మంది వైరస్‌కు బలవగా, 4474 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.09 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.72 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 218.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img