మళ్లీ 20 వేల చేరువలో కేసులు
మన దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మూడు రోజులగా కాస్త అటు ఇటుగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉందని తెలిపింది.