దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,113 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతోపాటు కరోనా బారినపడి నిన్న 346 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,78,882 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొవిడ్తో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 5,09,011గా ఉంది. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 91,930 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,16,77,641 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,72,95,87,490 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.