Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో మంకీపాక్స్‌ సోకిన తొలివ్యక్తికి నెగిటివ్‌ .. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

దేశంలో మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్‌ నెగెటివ్‌ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ వెల్లడిరచారు. శనివారమే అతడ్ని డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని మంత్రి తెలిపారు. అతని శరీరంపై వచ్చిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమైనట్లు చెప్పారు. అంతేకాదు బాధితుని కుటుంబసభ్యుల్లో ఎవరికీ మంకీపాక్స్‌ సోకలేదని, అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు వివరించారు. అలాగే మంకీపాక్స్‌ బారినపడి చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితుల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడిరచారు. కేరళ కొల్లం జిల్లాకు చెందిన మంకీపాక్స్‌ తొలిబాధితుడికి జులై 14న పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అతను విదేశాల నుంచి వచ్చాడు. ఆ తర్వాత కేరళలోనే మరో రెండు కేసులు వెలుగుచూశాయి. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చినవారే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img