Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ 163.84 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.గడిచిన 24గంటల్లో 22 లక్షల డోసులను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్‌ 93.33 శాతం కాగా గడిచిన 24గంటల్లో 2,86,384 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 22,02,472 కాగా రికవరీ శాతం 93.33 శాతంగా వుంది. వీక్లీ పాజిటివిటీ రేట్‌ 17.75 శాతంగా అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img