: ప్రకటించిన యూజీసీ
దేశంలో అత్యధికంగా దిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు
వాటికి పట్టాలిచ్చే అధికారం లేదని స్పష్టీకరణ
దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని.. అందులో రెండు ఏపీలోనే ఉన్నట్టు యూజీసీ ప్రకటించింది. యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ యూనివర్సిటీలకు డిగ్రీ పట్టాలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ పేర్కొన్నారు. ఇక, యూజీసీ ప్రకటించిన 21 నకిలీ యూనివర్సిటీల్లో ఏపీలో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి గుంటూరు కాకుమానువారితోటలోని క్రైస్ట్ న్యూటెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ కాగా, రెండోది విశాఖపట్టణం ఎన్జీవోస్ కాలనీలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఇక, దేశంలోనే అత్యధికంగా దిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్టు యూజీసీ పేర్కొంది.