Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో 635 కరోనా కేసులు..11 మంది మృతి

కొత్తగా635కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 635 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,41,29,590 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 11 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,30,546 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక దేశంలో యా క్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 7,175 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1010 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,29,590 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 1,02,581 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img