దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇటీవల డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్(డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తీరుతెన్నులు, లక్ష్యాలను స్పూరించే విధంగా పేరు, లోగోలతో పాటు ట్యాగ్లైన్ను సూచించాలని ప్రజల్ని ఆర్ధిక శాఖ కోరుతోంది.ఆగష్టు 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోగా ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచినవారికి రూ. 5 లక్షలు, రెండో స్థానానికి రూ. 3 లక్షలు, మూడో స్థానానికి రూ. 2 లక్షలు బహుమతులుగా అందజేస్తామని తెలిపింది.