ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆమ్ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. మహిళా అభ్యర్థి ద్రౌపది ముర్ముని తాము గౌరవిస్తామన్నారు. కానీ, యశ్వంత్ సిన్హాకే తమ ఓటు అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తరఫున ద్రౌపది ముర్ము- ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హా మధ్య పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు కూడా తమ మద్దతు ఎవరికనేది ప్రకటించాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం- ఎన్డీఏ అభ్యర్థి వైపే మొగ్గు చూపాయి. టీఆర్ఎస్ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. ఈ పరిస్థితుల మధ్య ఇక తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన నిర్ణయాన్ని వెల్లడిరచింది. ఊహించినట్టే- యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం తీసుకుంది.