లక్నో : విపరీతంగా పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కఠిన నిర్ణయాలు పాటించి సామాన్యునికి ఊరట నివ్వాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గురువారం పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలవల్ల సామాన్యుని జీవితం అల్లకల్లోలంగా మారిందన్నారు. ధరలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.