Friday, April 19, 2024
Friday, April 19, 2024

నన్ను తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌

తనపై తప్పుడు కేసు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ అన్నారు. ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసుపై తాను నోరు మెదిపినప్పటి నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాదిరిగా తనను కూడా తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఓ నేతను తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నించడం సరైంది కాదని నవాబ్‌ మాలిక్‌ మండిపడ్డారు.కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను అనుసరిస్తున్నారని, తన కుటుంబ సభ్యుల కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు. తాను దుబాయ్‌ పర్యటనకు వెళ్లగా అక్కడ కారులో కూర్చుని ఫోటోలు తీస్తున్న ఇద్దరు పట్టుబడ్డారని..దీనిపై తాము ముంబై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నరో నిగ్గుతేల్చాలని కోరతామని అన్నారు. దీనిపై తన వద్ద ఉన్న ఆధారాలను కూడా త్వరలో బయటపెడతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img