బీహార్ లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో నలుగురు విదేశీ పర్యాటకులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్కడ అప్రమత్తత ప్రకటించారు. తోటి ప్రయాణికులను గుర్తించి, పరీక్షలు నిర్వహించనున్నారు.చైనా నుంచి ఢల్లీి విమానాశ్రయానికి చేరుకున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని, అక్కడి నుంచి ట్యాక్సీలో ఆగ్రా తీసుకెళ్లిన డ్రైవర్ ను గుర్తించారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. అతడితో సన్నిహితంగా మెలిగిన 27 మంది నమూనాలను పరీక్షల కోసం పంపించారు. మరోవైపు నైనిటాల్ హైకోర్టు మాస్క్ లు ధరించే విధులకు హాజరు కావాలంటూ సిబ్బంది, న్యాయవాదులను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కరోనాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో నేడు ఒక సమావేశం నిర్వహించనున్నారు.