న్యూదిల్లీ: లోక్సభ ఎంపీ నవనీత్ రాణా తన కులధృవీకరణ పత్రాన్ని బోంబే హైకోర్టు కొట్టివేయడంతో, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై తాము జులైలో వాదనలు వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి స్వతంత్ర ఎంపీడి రాణే ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం ఎస్సీ కేటగిరి కిందకు వస్తుంది. రాణా తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తుండగా, ఈ విషయాన్ని మరొకసారి చూద్దామని జస్టిస్ వినీత్ శరణ్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మానం పేర్కొంది. జులైలో వింటామని చెప్పింది. మే10న జస్టిస్ శరణ్ పదవీ విరమణ చేయనుండడంతో ఈ కేసు మరో ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. రాణా కులధృవీకరణ పత్రంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం గతేడాది జూన్22న స్టే విధించింది. నకిలీ పత్రాలు సమర్పించి కులధృవీకరణ పత్రం పొందారని బోంబే హైకోర్టు చెబుతూ వారికి రూ.2లక్షల జరిమానా విధించింది.