విచారణకు సిద్దం : మాలిక్
ముంబైలోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు రోజుకో పరిణామంతో రాజకీయ దుమారం రేపుతోంది. అందులో భాగంగానే మంగళవారం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ గురించి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన విషయాలను వెల్లడిరచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీపావళి తర్వాత కొన్ని విషయాలు బయటపెడతానని చెప్పాను. నవాబ్ మాలిక్కు అండర్ వరల్డ్తో సంబంధాలున్నాయి అని ఆరోపించారు. దావూద్ గ్యాంగ్ సభ్యుడి మధ్య జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్ మాలిక్ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని, అసలు వారినుంచి భూమి ఎందుకు కొన్నారని ఫడ్నవిస్ ప్రశ్నించారు. అంతేకాదు దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా తనపై సంచలన ఆరోపణలు చేసిన దేవేంద్ర ఫడ్నవిస్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు నవాబ్మాలిక్. రేపు (బుధవారం) హైడ్రోజన్ బాంబు వేస్తా.. డీ-గ్యాంగ్తో ఆయనకున్న అండర్ వరల్డ్ లింకులను తానూ బయటపెడతానని అన్నారు. ఫడ్నవిస్ తాజా ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమే అంటూ ప్రతిసవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు.