: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
తనకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనే ఉంటానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం స్పష్టం చేశారు.సిద్ధూ కదలికలపై అనేక కథనాలు, ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా వీటికి సమాధానం చెప్పారు. జాతి పిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని వెల్లడిరచారు. ‘గాంధీజీ, శాస్త్రీజీ సిద్ధాంతాలను పాటిస్తూనే ఉంటాం. నాకు పదవి ఉన్నా లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనే కొనసాగుతాను. నన్ను బలహీన పర్చాలనే శక్తులు ఏమైనా చేసుకోనివ్వండి. నేను సానుకూల ఆలోచనలతోనే ముందుకు సాగుతాను. పంజాబ్ గెలుస్తుంది, పంజాబీయత (ప్రపంచ సోదరాభావం) గెలుస్తుంది, ప్రతి పంజాబీ గెలుస్తారు’. అని ట్వీట్ చేశారు.