Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నా కుమార్తెను కడసారిగా చూడనివ్వలేదు.. మోసం చేశారు.. రిసెప్షనిస్ట్‌ అంకిత తల్లి ఆవేదన

ఉత్తరాఖండ్‌ రిసెప్షనిస్ట్‌ అంకిత భండారీ హత్య కేసులో అనేక ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆమె తల్లి.. తనను తన కుమార్తె శవాన్ని కూడా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంకిత చనిపోయిందని తెలిసి ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ప్రచారం జరిగింది. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని అంకిత తల్లి చెప్పుకొచ్చింది. తన కూతురిని చూపిస్తామని చెప్పి.. అడవిలో నుంచి తమను తీసుకెళ్లారని, తర్వాత ఆస్పత్రిలో బలవంతంగా తనను వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టారని ఆమె తెలియజేసింది. ‘‘డాక్టర్లు నన్ను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టారు. అది ఎందుకని నేను అడిగాను.. కానీ చెప్పలేదు. నాకు సెలైన్‌ పెట్టి.. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.’’ అని ఆమె తెలియజేసింది.కాగా ఆదివారం అనేక నాటకీయ పరిణామాల నడుమ అంకిత భండారీ అంత్యక్రియలను నిర్వహించారు. మొదట అంత్యక్రియలు చేయడానికి నిరాకరించిన తండ్రి.. తర్వాత సీఎం హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నారు. కొన్ని రోజుల క్రితం కనిపించకుండాపోయిన 19 ఏళ్ల అంకితా భండారీ మృతదేహం కాలువలో బయటపడిరది. అంకితా మృతదేహాన్ని శనివారం రిషికేశ్‌లోని చిల్లా కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణానికి దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రిసార్ట్‌లో గెస్ట్‌లకు స్పెషల్‌ సర్వీస్‌ చేయాలని ఆమెను బలవంతం చేసినట్టు తెలిసింది. అకింతను బలవంతంగా వ్యభిచారంలోకి దించేందుకు వారు చేసిన ప్రయత్నాలను అంకిత తిరస్కరించింది. దాంతో హోటల్‌ యజమాని, బీజేపీ నాయకుడి కుమారుడు, మరో ఇద్దరు కలసి ఆమెను హత్య చేసినట్టు తెలుస్తుంది. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img