Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై.. చాట్‌జీపీటీని న్యాయ సలహా కోరిన కోర్టు..!

ఇతరులపై క్రూరంగా దాడిచేసిన వ్యక్తుల బెయిల్‌ అభ్యర్థన పై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి..? అని జడ్జిలు అడిగారు. దీనికి చాట్‌ జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనుషుల్ని చంపుతున్నారు కాబట్టి బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తాను అని సమాధానమిచ్చింది. అంతేకాదు, దాడి క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిలు మంజూరు చేయాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. నిర్దోషినని నిరూపించుకునేందుకు బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప బెయిలుకు అర్హుడు కాదని తేల్చి చెప్పింది. కాకపోతే, నిందితుడి నేరప్రవృత్తి, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులు బెయిలు మంజూరు చేయొచ్చని చాట్‌ జీపీటీ సూచించింది.నిందితులకు బెయిలు మంజూరు విషయంలో ాచాట్ జీపీటీ్ణని న్యాయ సలహా కోరడంపై న్యాయమూర్తులు స్పందించారు. న్యాయశాస్త్రంపై ాచాట్ జీపీటీ్ణకి ఎలాంటి అవగాహన ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేసినట్లు స్పస్టం చేశారు. అంతే తప్ప చాట్‌ జీపీటీ వెల్లడించే అభిప్రాయాలను పాటించడానికి కాదని తెలిపారు. ాచాట్ జీపీటీ్ణ ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తీర్పులను వెలువరించ కూడదని జస్టిస్ అనూప్ చిట్కారా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఈ సంఘటన మొట్టమొదటదిగా భావిస్తున్నారు.

ఇక, అసలు విషయానికి వస్తే.. పంజాబ్‌కు చెందిన నిందితుడిపై 2020లో హత్య, ఇతర నేరాలకు సంబంధించి కేసు నమోదైంది. బెయిలు కోసం నిందితుడు పెట్టుకున్న దరఖాస్తుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో నిందితుడు బెయిల్‌కు అర్హుడని పిటిషన్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, నిందితుడి గతాన్ని బట్టి బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడిని బెయిలుపై విడుదల చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img