బీజేపీ కూటమిలో నితీశ్ కుమార్ సౌకర్యవంతంగా లేనందునే బయటకు వచ్చి ప్రత్యర్థి కూటమిలో చేరారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ పరిణామాలు రాష్ట్రానికే పరిమితమన్న ఆయన.. జాతీయ స్థాయిలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 2017 నుంచి 2022 వరకు నీతీశ్ కుమార్ బీజేపీతో కలిసి ఉన్నారు. ఎన్నడూ అక్కడ సంతోషంగా ఉన్నట్లు ఆయన కనిపించలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందుకే మహాకూటమితో ప్రయోగం చేద్దామని భావించి ఉండవచ్చు అని ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ తెలిపారు.