Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిత్యానందకు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌..

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. 2010 నాటి కేసుకు సంబంధించి రామనగర జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది. అయితే, గతంలోనే ఓపెన్‌-ఎండెడ్‌ వారెంట్‌ను కోర్టు జారీచేయడం గమనార్హం. అత్యాచార కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆ వారెంట్‌ జారీ చేసినప్పటికీ నిత్యానంద ఆచూకీని మాత్రం పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. నిత్యానందపై అత్యాచార కేసుకు సంబంధించి విచారణ గతంలోనే ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు ముగ్గురు సాక్షులను కూడా కోర్టు విచారించింది. అయితే, నిందితుడు విచారణకు హాజరు కాకపోవడంతో గత మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన సమన్లకు నిత్యానంద కనీసం స్పందించకపోవడంతో మరోసారి నాన్‌-బెయిల్‌బుల్‌ వారెంట్‌ను కోర్టు జారీచేసింది. సెప్టెంబర్‌ 23లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2010లో ఆయనపై పోలీసులు రేప్‌ కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిత్యానందను అరెస్ట్‌ చేయగా.. తర్వాత బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చాడు. అనంతరం నిత్యానంద దేశం విడిచి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని లెనిన్‌ 2020లో కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో నిత్యానంద బెయిల్‌ను రద్దు చేసింది.కాగా, దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ‘కైలాస’ అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన వార్తలు వచ్చాయి. అయితే, కైలాస అనే ప్రదేశం ఎక్కడ ఉందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. గుర్తుతెలియని ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడుతూ ఆ వీడియోలను సోషల్‌ మీడియా పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి. ఈక్వెడార్‌ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి కైలాస అని పేరు పెట్టినట్లు నిత్యానంద ఆ వీడియోలో చెప్పాడు. ఈ దీవిని ప్రత్యేక హిందూ దేశంగా గుర్తించాలని పేర్కొన్నాడు. అంతేకాదు, ప్రత్యేక కరెన్సీ, బ్యాంకును ఏర్పాటుచేసుకున్నట్టు ప్రకటించారు.కానీ, ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈక్వెడార్‌.. నిత్యానంద తమ దేశంలో ఆశ్రయం కోరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. నిత్యానంద తమ దేశంలో లేడని అప్పట్లో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img