Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిరుద్యోగులపై బీజేపీ ప్రభుత్వం కన్నెర్ర

విచక్షణారహితంగా లాఠీచార్జి…అరెస్టు
భోపాల్‌ : నిరుద్యోగులపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండు చేస్తూ భోపాల్‌లో ఆందోళన చేసిన నిరుద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. నిరుద్యోగులపై కిరాతకంగా, నిసిగ్గుగా దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండిరచింది. ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు రaుళిపించడంపై మండిపడిరది. బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వంపై విమర్శలు గుప్పించింది. ఆందోళనకారులు నీలం పార్కు నుంచి రాజ్‌భవన్‌ వైపు పరుగులు తీస్తుండటంతో స్వల్ప లాఠీచార్జి చేశామని పోలీసులు చెప్పారు. 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని, ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. నిరుద్యోగంపై ఉద్యమం పేరుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు భోపాల్‌లో ఆందోళనకు దిగారు. గడచిన కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. నిరుద్యోగుల వయోపరిమితి పెరిగిపోతోందని, ఇక ఉద్యోగాలకు తమకు అవకాశం ఉండదని అంటున్నారు. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నిరుద్యోగులు నీలం పార్కు నుంచి ముఖ్యమంత్రి నివాసం దిశగా ప్రదర్శన చేపట్టగా పోలీసులు వారిపై దారుణంగా లాఠీచార్జి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత నినాదాలు చేస్తున్న యువతను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. నిరుద్యోగులపై లాఠీచార్జి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img