Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలి : కేంద్రం

కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పరీక్షలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవియా మంగళవారం కోరారు. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచించారు. కోవిడ్‌ -19 పరీక్ష, టీకా డేటాను సకాలంలో పంపాలని మాండవ్య వారిని కోరారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హోం ఐసోలేషన్‌ను ఎంచుకుంటున్నందున, జాతీయ మార్గదర్శకాల ప్రకారం వారిని పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రి రాష్ట్రాలకు చెప్పారు. కోవిడ్‌-19 ఉప్పెనతో పోరాడేందుకు సన్నాహాల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img