ఫోన్ ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. మాజీ కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాపై రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభాషణల టేపులను పరిశీలించడంలో అభ్యంతరకరం ఏమీ లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు ఇవ్వాల (బుధవారం) తెలిపింది. కార్పొరేట్ సంస్థల మధ్య మధ్యవర్తిత్వం నెరపడమే వృత్తిగా సాగిన నీరా రాడియా టేపుల వ్యవహారంపై ఇవ్వాల సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2009లో కేంద్ర కేబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించి నీరా రాడియా కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.