న్యూదిల్లీ: ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జులై 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తుంది. జులై 20న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జులై 22. తదుపరి రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేటెడ్ సభ్యులతో పాటు లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉండటంతో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు సునాయాసంగా బీజేపీ భావిస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఇంకా ప్రకటించలేదు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల సభ్యులు 788 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. రహస్య పద్ధతిలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ప్రతి అభ్యర్థి అత్యధికంగా నాలుగు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. ఎన్నికల డిపాజిట్ రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది.