ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఓమిక్రాన్ వేరియంట్తో పాటు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.గత గురువారం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు.డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కనీసం మూడు రెట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుందని గతంలో కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది.