నో బాల్్ణ సిగ్నల్ ఇచ్చినందుకు అంపైర్ను కొట్టి కత్తితో పొడిచి చంపారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం శంకర్పూర్, బెర్హంపూర్కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహిలాంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల లక్కీ రౌత్, అంపైర్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్గా ఉన్న లక్కీ రౌత్ ానో బాల్్ణ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇది గొడవకు దారి తీసింది.