గౌహతి`హౌరా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. బుధవారం అస్సాంలోని చాయ్గావ్ స్టేషన్ సమీపంలో రైలు ట్రాక్ మారుతుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.