ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆగస్ట్ 4న దాదాపు దేశవ్యాప్తంగా 140కి పైగా రైళ్ల రద్దు చేసింది. మెయింటెనెన్స్ వర్క్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, బ్యాడ్ వెదర్ కండీషన్స్, ఆపరేషనల్ ఇష్యూస్ వంటివి ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఐఆర్సీటీసీ రేపు 120కి పైగా ట్రైన్స్ను రద్దు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రైల్వే అధికారులు 21 ట్రైన్స్కు సంబంధించిన సోర్స్ స్టేషన్ను మార్చారు.రద్దు అయిన ట్రైన్స్ విషయానికి వస్తే.. మహరాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్నాటక, కేరళ, పంజాబ్, న్యూఢల్లీి, పశ్చిమ బెంగాల్, బీహార్, రaార్ఖండ్, అసోం వంటి రాష్ట్రాల్లో పలు ప్రాంతాల మధ్య ప్రయాణించాల్సి ఉంది. రైల్వే ప్రయాణికుల సౌకర్యర్ధం ఇండియన్ రైల్వేస్ రద్దయిన ట్రైన్స్ వివరాలను ఇండియన్ రైల్వేస్ అప్డేట్ చేసింది. ఎన్టీఈఎస్ యాప్ ద్వారా ట్రైన్స్ వివరాలను పొందొచ్చు.