ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి పలు రైళ్ల రాకపోకలను మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా అక్టోబర్ 2న సికింద్రాబాద్- గౌహతి (02513), 7వ తేదీన సికింద్రాబాద్-గౌహతి (02514), అక్టోబర్ 4, 5వ తేదీల్లో గౌహతి- బెంగుళూరు(02510), అక్టోబర్ 7, 8వ తేదీల్లో బెంగుళూరు-గౌహతి (02509), అక్టోబర్ 2న యశ్వంత్పూర్- కామాఖ్య(02551), అక్టోబర్ 6న కామాఖ్య- యశ్వంత్పూర్-రైలు(02552), అక్టోబర్ 2న గౌహతి- బెంగుళూరు (2510) రైళ్లను న్యూ కోచ్బేహార్, మతభంగ, రాణినగర్, జలపాయ్గురిల మీదుగా మళ్లిస్తున్నట్టు తెలిపారు.