ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. ఈ ట్రైన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే మూడు సార్లు ట్రాక్పైకి వచ్చిన పశువులను ఢీ కొట్టింది. తాజాగా మరోసారి ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయత్రం గుజరాత్లోని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడిరది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం