11 జిల్లాల్లో 65 కేసుల గుర్తింపు
పశ్చిమబెంగాల్ ప్రజలను ఇప్పుడు ‘బ్లాక్ ఫీవర్’ జ్వరం కలవరపెడుతోంది. రాష్ట్రంలోని 11 జిల్లాలో ఇప్పటికి మొత్తం 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు వెలుగు చూశాయి. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి. ‘ఈ వ్యాధిని ప్రభుత్వం కట్డడి చేయగలదు. ఎక్కువ రోజుల పాటు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే జ్వరం బయటపడుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయి’’అని ఓ అధికారి తెలిపారు. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బ్లాక్ ఫీవర్ జ్వరంతో ఎవరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని రాష్ట్ర యంత్రాంగం స్పష్టం చేసింది.