పశ్చిమ బెంగాల్లోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నార్త్ 24 పరిగణాస్ జిల్లాలో క్లాసులు జరుగుతుండగా టిటానగర్ ఫ్రీ హైస్కూల్ టెర్రాస్పై బాంబు పేలింది. శనివారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ పాఠశాల బరాక్పూర్ పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బాంబుకు సంబంధించిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు గురించి తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు పరుగులు తీశారు. అయితే అదృష్టం కొద్ది ఈ ఘటనలో విద్యార్థులు ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఈ ఘటన గురించి విన్న వెంటనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అర్జున్ సింగ్ సంఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఇది దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై కోల్కతా పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్న రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. ప్రాధాన్యత సంతరించుకుంది.