Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పాట్నా బాంబు పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష

పాట్నా : 2013 నాటి పాట్నా బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన 9 మంది నేరస్తులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు శిక్షలను ఖరారు చేసింది. నలుగురు నేరస్తులకు ఉరి శిక్ష విధించింది. మరో ఇద్దరికీ యావజ్జీవం, మరో ఇద్దరికీ పదేళ్లు, ఒకరికీ ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ జడ్జి గుర్విందర్‌ సింగ్‌ మల్హోత్ర తీర్పునిచ్చారు. బాంబు పేలుళ్లు జరిగిన 8 ఏళ్ల తర్వాత కేసులో దోషులకు శిక్ష ఖరారయింది. అక్టోబరు 27,2013న బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో బీజేపీ నేతృత్వంలో హుంకార్‌ సభ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో ముఖ్య అతిధిగా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతో పాటు అనేక మంది వేదికపై ఉన్న సమయంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 89 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరుసటి రోజే ఎన్‌ఐఎ దర్యాప్తు చేపట్టింది. తర్వాత ఏడాదికి చార్జీషీట్‌ దాఖలు చేసి.. 11 మందిని జాబితాలో చేర్చింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఇద్దరు నిర్దోషులుగా బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img