పారా ఒలింపిక్స్-2020కి భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనున్న సందర్భంగా వారితో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీకానున్నారు. మంగళవారం ప్రధాని క్రీడాకారులతో భేటీకానున్నారని పీఎంఓ పేర్కొంది. వీడియోకాన్ఫరెన్స్లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పాల్గొననున్నారు.టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి.