Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పార్టీ అధ్యక్ష ఎన్నికల నుంచి గెహ్లాట్‌ను తప్పించండి..

సోనియాకు సీడబ్ల్యూసీ లేఖ..!
రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి సంక్షోభం నెలకొన్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్ఠానం నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ను నియమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక్కసారిగా గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో పాటు ఆదివారం రాత్రి మూకుమ్మడి రాజీనామాలకు దిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్‌ వర్గింగ్‌ కమిటీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్‌ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని, పార్టీ అగ్రనాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని లేఖలో సీడబ్ల్యూసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయనకు బదులుగా మరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img