Friday, April 19, 2024
Friday, April 19, 2024

పికప్‌ వ్యాన్‌లో విద్యుదాఘాతం.. 10 మంది దుర్మరణం

పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బేహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్‌ వ్యాన్‌లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జల్పాయ్‌గురి దవాఖానకు తరలించారు. డీజే సిస్టం ఉన్న పికప్‌ వ్యానులో జనరేటర్‌ వైరు తగలడంతో షార్ట్‌సర్క్యూట్‌ అయిందని పోలీసులు తెలిపారు. కావడి యాత్రలో భాగంగా కన్వరియాలు కూచ్‌బేహార్‌ నుంచి జల్పేష్‌ పట్టణానికి వెళ్తున్నారని, ఆదివారం అర్ధరాత్రి సమయంలో ధార్ల బ్రిడ్జి వద్ద విద్యుదాఘాతం జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ అమిత్‌ వర్మ చెప్పారు. డీజే సిస్టం జనరేటర్‌కు ఉన్న విద్యుత్‌ వైరు వ్యాను వెనుకభాగంలో కట్టారని, అందులో విద్యుత్‌ ప్రసరించి వ్యానులో ఉన్న వారికి కరెంట్‌ షాక్‌ తగిలిందని వెల్లడిరచారు. వ్యాన్‌ను సీజ్‌ చేశామని, దాని డ్రైవర్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img