సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ భరోసా ఇచ్చింది.ప్రపంచంలో భారత్లోనే అత్యధికంగా టీకా పొందని పిల్లలున్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలని యూనిసెఫ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది.