పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు.. ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీని ఈ సందర్భంగా సిద్దూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తీర్పు దేవుడిచ్చిన తీర్పుతో సమానమని, ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను. ఆప్కు శుభాకాంక్షలు అంటూ సిద్దూ ట్వీట్ చేశారు.పంజాబ్లో ఆప్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు మూడు స్థానాల్లో గెలిచిన ఆప్ మరో 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒకచోట గెలిచి, 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.