పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ విజ్ఞప్తి చేశారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర మంత్రి పోలియో చుక్కలను వేశారు.పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయాణ ప్రాంగణాలో ప్రత్యేక కేంద్రాలు, మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు.