Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ప్రధాని మోదీ ఇంజనీర్స్‌ డే శుభాకాంక్షలు

న్యూదిల్లీ : ఇంజనీర్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సివిల్‌ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంత్యుత్సవానికి సూచికగా సెప్టెంబరు 15న ఇంజనీర్స్‌ డే జరుపుతారు. ‘కష్టపడే ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్‌ డే శుభాకాంక్షలు. మన గ్రహం సాంకేతికంగా అభివృద్ధి చెందడంలో వారి కీలక పాత్రకు వారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. ఎం.విశ్వేశ్వరయ్య జయంత్యుత్సవం సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img