ఫోర్బ్స్ వెల్లడి
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీ రెండో స్థానానికి చేరారు. స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీలకు చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో.. ఆదానీ ఆస్తుల విలువ పెరిగిందని.. ఈ క్రమంలో ఆయన రెండో స్థానానికి చేరారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది. ప్రస్తుతం గౌతం అదానీ ఆస్తుల విలువ 154.7 బిలియన్ల డాలర్లు. ఇక టాప్ నెంబర్లో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 273.5 బిలియన్ల డాలర్లు. గత నెలలో మూడవ స్థానంలో ఉన్న అదానీ.. లూయిస్ విట్టాన్ ఓనర్ను దాటేసి ఇప్పుడు రెండవ స్థానంలోకి చేరుకున్నారు. అర్నాల్ట్ ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 153.5 బిలియన్ల డాలర్లు. నాలుగవ స్థానంలో ఉన్న బేజోస్ ఆస్తుల విలువ 149.7 బిలియన్ల డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 92 బిలియన్ల డాలర్లతో 8వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూపు ఓనర్ అయిన అదానీకి ఏడు పబ్లిక్ లిస్టింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, ఎనర్జీ, ఇతర రంగాల్లో ఆయనకు కంపెనీలు ఉన్నాయి. గత అయిదేళ్లలో అదానీ .. విమానాశ్రయాలు, సిమెంటు, కాపర్ రిఫైనింగ్, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, పెట్రోకెమికల్ రిఫైనింగ్, రోడ్డు, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడి పెట్టారు. టెలికాం స్పేస్ రంగంలోకి కూడా అదానీ ఎంట్రీ ఇవ్వనున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం అదానీ గ్రూపు సుమారు 70 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నది.