భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఇప్పుడు ప్రపంచంలోని ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఆయన ఆస్తులు సుమారు 137 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో టాప్ ప్లేస్లో ఉన్న కుబేరుల్లో ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ నిలిచారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఆస్తులు 251 బిలియన్ల డాలర్లు కాగా, అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బేజోస్ ఆస్తుల విలువ 153 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొన్నది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త లూయిస్ విటాన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ అర్నాల్ట్ ను దాటేసి అదానీ మూడవ స్థానానికి చేరుకున్నారు.బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. ఆసియాకు చెందిన సంపన్నుల్లో తొలిసారి ఆ జాబితాలో చేరారు.