Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వం ఎందుకు సిగ్గుపడుతోంది : చిదంబరం

న్యూదిల్లీ : రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేసే తీర్మానాన్ని ఎందుకు అనుమతించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి చిదంబరం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘రాజ్యసభ విధివిధానాల నియమావళిలోని 256(2) నిబంధన చాలా స్పష్టంగా ఉంది. ఒక సభ్యుడు లేదా సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేయడానికి ఎప్పుడైనా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్ట వచ్చు అలాంటి తీర్మానం ఈరోజు సభ ముందుకు వచ్చింది. ఎందుకు ఇది అనుమతించబడలేదు?’ అని చిదంబరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం తీర్మానంపై ఓటింగ్‌కు ఎందుకు సిగ్గుపడుతోంది? ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఓడిరచి, న్యాయం పట్ల తనకున్న చిన్న గౌరవాన్ని ప్రకటించనివ్వండి’ అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img