న్యూదిల్లీ : భారత్- బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వ్యవహారాలపై చర్చించేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసన్ మహ్మూద్ను మంగళవారం కలిసారు. బంగ్లాదేశ్ మంత్రి మహ్మూద్ను కలిసినందుకు సంతోషంగా ఉందని, రెండు దేశాల ద్వైపాక్షిక బంధం నిలకడగా సాగుతోందని, రెండు దేశాల మధ్య మీడియా
సామాచార శాఖకు సంబంధించిన విషయాలు చర్చించామని జయశంకర్ ట్వీట్ చేశారు. మహ్మూద్ అధికార పర్యటనపై భారత్ వచ్చారు. గత రెండు నెలలగా విరివిరిగా భారత్`బంగ్లాదేశ్ మధ్య అధికారుల పర్యటనలు జరుగుతున్నాయి. మార్చి నెలలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్లో పర్యటించగా, ఏప్రిల్ నెలలో ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఎంఎం నరవణే బంగ్లాదేశ్లో ఐదు రోజుల అధికార పర్యటనకు వెళ్లారు.