Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బస్సులను ఢీ కొన్న ట్రక్కు.. 14మంది మృతి..

మృతుల కుటుంబాలకి రూ.10లక్షల ఆర్థికసాయం
రోడ్డుపక్కన ఆగి ఉన్న మూడు బస్సులను సిమెంట్‌ లోడ్‌ తో వెళ్తున్న ట్రక్కు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. కాగా ఈ ఘటనలో 60మంది గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రేవా-సత్నా సరిహద్దు బరా‰డా గ్రామ సమీపంలో జరిగిందని అధికారులు తెలిపారు. బస్సుల్లోని వ్యక్తులు సత్నా నగరంలోని ‘కోల్‌ మహాకుంభ్‌’ నుండి తిరిగి వస్తున్నారట. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ (హోమ్‌) డాక్టర్‌ రాజేష్‌ రాజోరా వెల్లడిరచారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సిద్ధి, రేవా జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని రాజోరా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img