: గోవా సీఎం
బాలికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్..ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవ్వడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దురదృష్ణకరమైన ఘటన గురించి ప్రభుత్వానికి అధిపతిగా తానెంతో బాధపడ్డానని చెప్పారు. మైనర్ బాలికలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. గోవాలోని బెనాలిమ్ బీచ్లో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. అయితే రాత్రిళ్లు అమ్మాయిలు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. పిల్లలు బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని అన్నారు.