దేశ రాజధాని ఢల్లీిలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెకు సర్జరీ సమయంలో ఆస్పత్రిలో అవయవాలను దొంగిలించి, ఆమె శరీరాన్ని ప్లాస్టిక్ కవర్లతో నింపి కుట్టేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అవయవాలు తీసేయడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. 15 ఏళ్ల ఆ బాలిక జనవరి 21న కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఢల్లీి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే హిందూ రావ్ ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 24ల వైద్యులు ఆమెకు అపెండిసైటిస్ ఆపరేషన్ నిర్వహించారు. జనవరి 26న ఆమె మృతి చెందిందని చెప్పి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఆ తర్వాత అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఢల్లీి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం రిపోర్టులు వస్తే గానీ, బాలిక తల్లిదండ్రుల ఆరోపణలు నిజమో, కాదో తేలుతుందని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఢల్లీి ప్రభుత్వాన్ని పోలీసులు కోరారు. ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని తేజ్ బహదూర్ ఆస్పత్రిలో భద్రపరిచారు.