Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీఏ 4, బీఏ 5 వేరియంట్ల కలకలం.. మహారాష్ట్రలో ఆందోళన

దేశంలో కరోనా కొత్త వేరియంట్ల రూపంలో కలవరపెడుతోంది. తాజాగా మహారాష్ట్రలోఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 అలజడి రేపుతున్నాయి. ఈ వైరస్‌ కేసుల సంఖ్య 73కు చేరుకుంది. ఈ కేసులన్నీ పుణే జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలో గడిచిన రెండు వారాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. బీఏ .4, బీఏ.5 వేరియంట్ల కారణంగా బ్రిటన్‌లో మరో కొవిడ్‌ వేవ్‌ కొనసాగుతోంది. అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం జనం ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోనూ ఈ తరహా వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర పరిణామమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 బారిన పడ్డ వారందరిలో లక్షణాలేవీ లేవని.. అందరూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి, కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. థానే, నాగపూర్‌, పాల్గార్‌, రాయ్‌గఢ్‌ ప్రాంతాల్లో ఇటీవల కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వైద్య అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో ఈ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img