యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయుష్, ఆహార భద్రత మంత్రి ధరంసింగ్ సైనీ గురువారం బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీని వీడిన తొమ్మిదో ఎమ్మెల్యే ధరంసింగ్ సైనీ కావడం గమనార్హం. క్యాబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామతో బీజేపీలో మొదలైన నిష్క్రమణల పర్వం ఆపై సాగుతోంది. ధరంసింగ్ గురువారం ఉదయం తన తన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపడంతోపాటు అధికారిక నివాసాన్ని ఖాళీచేయడంతో ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.