లక్నో: ప్రధాని నరంద్రమోదీకి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ అని మోదీ అనడంపై అఖిలేశ్ స్పందిస్తూ.. ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ కాదని, బీజేపీకే రెడ్ అలర్ట్ అని అఖిలేశ్ ట్వీట్ చేశారు. యూపీలో బీజేపీని అధికారం నుంచి దించేది ఎర్ర టోపీలేనని పేర్కొన్నారు. బీజేపీకి ఎర్ర టోపీలేగాక ఇంకా చాలా రెడ్ అలర్ట్లు ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు కూలీలపై దారుణాలు, హత్రాస్ ఘటన, లఖింపూర్ ఖేరీ ఘటన, విద్యావ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ వినాశనం ఇవన్నీ ఎర్ర టోపీలతోపాటుగా బీజేపీకి రెడ్ అలర్ట్లు అన్నారు. వీటిలో బీజేపీని అధికారం నుంచి దించేది ఏదోనంటూ అఖిలేష్ తన హిందీ ట్వీట్ను ముగించారు.