కుంటి సాకులు చెప్పొద్దు..చర్యలు తీసుకోవాలి : మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రం బీర్భూంలో హింసకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, వెంటనే శిక్షించాలని సీఎం మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ‘నిందితులు పారిపోయారు.. దొరకడం లేదని కుంటి సాకులు చెప్పొద్దని పోలీసులకు సూచించారు. నిందితులు పారిపోయారు.. దొరకడం లేదని కుంటి సాకులు చెప్పొద్దు. బాధ్యులైన వారిని శిక్షించాలి. ఫిర్యాదు స్వీకరించడంలో అలసత్వం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోండి. సాక్షులకు అవసరమైన భద్రత కూడా కల్పించండి.ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయిన వారికి, బాగు చేసుకునే నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇస్తాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తాం.’ అని మమత బెనర్జీ ప్రకటించారు.బీర్భూం ప్రాంతంలో సీఎం మమత పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మమతకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడిరది. సంబరాలు చేసుకుంటారా? సంతాపం వ్యక్తం చేస్తారా? అని ప్రశ్నించింది. మహిళలను, పిల్లలను సజీవ దహనం చేశారని, చంపేశారని బీజేపీ మండిపడిరది. దర్యాప్తు చేసే బదులు, స్వాగత తోరణాలు కట్టారని ఆగ్రహం వ్యక్తంచేసింది.